సాలూరు మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం జైపూర్ రోడ్ లో సాలూరు మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ విజయ దుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉత్సవాలు జరుపుతామని అన్నారు. మండపంలో కొలువైన బంగారు తల్లి దుర్గమ్మ దర్శనంతో భక్తులు భక్త పారవశ్యానికి లోనయ్యారు.

Continue Reading

దసరా సందర్భంగా మామిడిపల్లి రోడ్ శ్రీ సంతోషిమాత ఆలయం లో ప్రత్యేక పూజలు

దసరా సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయం లో ప్రత్యేక పూజలు… పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మామిడిపల్లి రోడ్డులో కోరి వెలసిన శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక పూజలు, హోమాలను, కుంకుమ పూజలు తదితర కైంకర్యాలను నిర్వహిస్తామని భక్త బృందం ఒక ప్రకటన విడుదల చేశారు.

Continue Reading

సాలూరు లో వైద్య శిబిరం…300 మంది కి పైగా హాజరు…

      సాలూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు కి విశేష స్పందన లభించింది సుమారు 300 మందికి పైగా ప్రజలు హాజరై వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం 4:00 వరకు కొనసాగింది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం లో భాగంగా స్త్రీల కోసం […]

Continue Reading

15 రోజుల పాటు స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం

      తోణాo ప్రాథమిక కేంద్రం లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి 75 వ పుట్టిన రోజు సందర్భంగా దేశం లో 75 వేల మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని ఒక మంచి  ప్రతి ఏరియా హాస్పిటల్,ప్రాథమిక కేంద్రాలలో, హెల్త్ వెల్నెస్ సెంటర్స్ లో ఈ కార్యక్రమం 15 రోజులు పాటు (17th నుంచి అక్టోబర్ 2 వరకు) మెడికల్ క్యాంప్స్ నిర్వహించి, ఆ క్యాంప్స్ లో క్షయ వ్యాధి కి సంబంధించి స్క్రీనింగ్ […]

Continue Reading

చిన్న తరహా పరిశ్రమలకు తోడ్పాటు

చిన్న తరహా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు పై ఎల్ కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్, పాల్ మెమోరియల్ ఫౌండేషన్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.. ఎమ్మెస్ ఎం ఎ ఇ అవగాహన సదస్సు.. గురువారం ఎల్ కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్, పాల్ మెమోరియల్ ఫౌండేషన్ నందు విజయనగరం జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వారి ఆదేశానుసారం ఏజెడ్ కంపెనీ సీఈవో కాళ్ళ జగపతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ […]

Continue Reading

ఘనంగా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విశ్వకర్మ నిమజ్జన కార్యక్రమం

పాచిపెంట మండలం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఊరేగింపు కార్యక్రమమునకు భక్తులు భారీగా పాల్గొన్నారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విశ్వకర్మ విగ్రహమునకు పాచిపెంట గ్రామంలో ఊరేగింపు కనులవిందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కలగర్ల చిన్న, సెక్రెటరీ పట్నాన ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ముగడ సాంబమూర్తి, వైస్ సెక్రెటరీ ముగడ సత్యనారాయణ, కోశాధికారి మారోజు సంతు, కమిటీ పెద్దలు టి అప్పలరాజు ,లక్కోజు గణపతి రావు, కలగర్ల ఈశ్వరరావు, చిట్టూరి సత్యనారాయణ, […]

Continue Reading

మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడం పై నిరసన గళం

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు లో నిర్మాణంలో ఉన్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల సందర్శించారు.మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడం పై రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే పిపిపి విధానం రద్దు చేయాలని అరుకు ఎంపీ గుమ్మ తనూజా రాణి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో నేతలు,కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

సెప్టెంబర్ 20న సాలూరు టౌన్ లో మెగా మెడికల్ క్యాంపు

  సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుందని, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.ఆర్. మీనాక్షి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సాలూరు టౌన్ లో ఏరియా ఆసుపత్రిలో సెప్టెంబర్ 20 శనివారం ఉదయం 9 గంటల నుండి నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో మహిళల కోసం ఎన్ […]

Continue Reading

ఓజోన్ పొర పరిరక్షణ అందరి బాధ్యత…

పాంచాలి,సెప్టెంబర్ 17,(4th Estate News) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాంచాలి లో సెప్టెంబర్ 16 న ఓజోన్ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీసి క్లస్టర్ కోఆర్డినేటర్ , జీవశాస్త్ర ఉపాధ్యాయులు డి ప్రసన్నకుమార్ విద్యార్థులకు ఓజోన్ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించారు. పర్యావరణ అనుకూల విధానాలను అందరం పాటించాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు ఓజోన్ పరిరక్షణ నినాదాలు చేస్తూ గొడుగులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు […]

Continue Reading

తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

  అమరావతి, సెప్టెంబర్ 18,(4th Estate News) గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ ఇలా పేర్కొన్నారు: రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 55 వేల 746 అంగన్వాడీ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 48,268 అంగన్వాడీ కార్యకర్తలు, 6,732 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 47,569 అంగన్వాడీ సహాయకులు సేవలందిస్తున్నారు. అంగన్వాడీ సిబ్బందికి […]

Continue Reading