అంగరంగ వైభవంగా గోపాష్టమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్

విజయనగరంలోని తన నివాసమైన సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో కార్తీక మాస గోపాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి , అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ గోపాష్టమి వేడుకలులో పాల్గొని శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన గోపాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *