
విజయవాడ ఉత్సవ్ లో సందడి చేసిన కాంతారా చిత్ర బృందం
సెప్టెంబర్ 30, 2025న విజయవాడ ఎక్స్పోలో జరిగిన కాంతారా
చాప్టర్ 1 రోర్ లో భాగంగా ఈవెంట్ లో కన్నడ నటుడు,దర్శకుడు,రచయిత రిషబ్ శెట్టి,హీరోయిన్ రుక్మిణి వసంత్,మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ తదితరులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు . ఈ కార్యక్రమం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఒక గీతం విడుదల చేశారు.చిత్ర బృందం తెలుగు లో మాట్లాడడానికి ప్రయత్నించారు.త్వరలో హనుమాన్ చిత్రం సీక్వెల్ జై హనుమాన్ చిత్రం విడుదల సమయానికి తెలుగు పూర్తి గా నేర్చుకొని వస్తానని హామీ ఇచ్చారు.కాంతారా ప్రీక్వెల్ ను ఆదరించాలని కోరారు.ఈ కార్యక్రమం విజయవాడ ఉత్సవ్ ప్రారంభోత్సవంలో భాగంగా జరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద ఫెస్టివ్ కార్నివల్గా గుర్తింపు పొందింది.