సాలూరు,ఆగస్టు 24,(4th Estate News)
సాలూరు టౌన్ బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఆగస్టు 24 న,మెగా రక్తదాన శిబిరంలో యువకులు, ఉత్సాహవంతులైన చింతా రామకృష్ణ చంద్రం పేట వాస్త్యవులు 44వ సారి ఉత్సాహం గా ఆనందం గా రక్తం దానం లో పాల్గొన్నారు.అతను ఇన్ని సార్లు చేయటానికి మాటల్లో యువ వయసు నుండి మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ తో రక్త దానం, అవయువ దానం అనేది మరో ప్రాణం నిలబెడుతుంది .దేవుడు మనకిచ్చే అవకాశం గా నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,ఆరోగ్య కరమైన అలవాట్లు అలవరుచుకోవాలని,ఆరోగ్యం మహా భాగ్యం అనే మాట గుర్తుపెట్టుకొని, సమాజం లో మానవతా దృక్పథం తో సాటివారికి ఉపయోగపడి నలుగురికీ ఆదర్శంగా ఉందాం అని పత్రికా ముఖంగా కోరారు.